Sunday, 12 September 2021

ఆదిలాబాద్ పట్టణంలో ఆదివాసుల వెతలు

 ఆదిలాబాద్ పట్టణంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం పట్టణ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి తొడసం భీంరావు మాట్లాడారు. 49 వార్డుల్లో సుమారు 7,000 గిరిజన కుటుంబాలున్నాయని, వారిలో ఎక్కువ మంది అద్దె ఇళ్ళలో నివసిస్తున్నారు. వారంతా అడ్డా కూలీలుగా, పట్టణం చుట్టు పక్కల గ్రామాల్లో వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నారు. వారి సంపాదనంతా కిరాయిలకే పోతుంది. పిల్లల చదువులు, ఆరోగ్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్నారు.

వారికి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన మరియు డబుల్ బెడ్రూం స్కీంల ద్వారా ఇండ్లు మంజూరు చేయాలని డిమాండు చేసారు. 

Friday, 15 May 2020

గాలిలో కార్మిక భద్రత

కార్మికుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని, కనీస వేతనాన్నిఅమలు చేస్తామని,  అసంఘటిత రంగంలోనూ అపాయింట్‌మెంట్ లెటర్స్,హెల్త్ చెకప్స్ ఉండేలా చేస్తామని చెప్తూనే కార్మిక చట్టాల సవరణలు, రద్దు వంటి చర్యలు చేపట్టింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే  కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తుండటం గమనార్హం.   మొదట ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్ కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోగా.. ఆ తర్వాత గుజరాత్‌ కూడా అదే బాటలో పయనించింది. అసోం సైతం 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చింది. పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాలు కూడా కార్మిక చట్టాల్లో సడలింపుల గురించి సమాలోచనలు జరుపుతున్నాయి.

 బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్,గుజరాత్ రాష్ట్రాలు చాలావరకు కార్మిక చట్టాలను రద్దు చేశాయి. ఫ్యాక్టరీల్లో కార్మికులకు కావాల్సిన మౌలిక సదుపాయాల దగ్గరి నుంచి మొదలు ఉద్యోగపరంగా పొందే అన్ని బెనిఫిట్స్‌లోనూ యాజమాన్యాలకే పూర్తి స్వేచ్చనిచ్చాయి. అంటే,యజమాని కార్మికుల పట్ల దయ తలిస్తేనే పని ప్రదేశంలో వారికి మంచి నీళ్లు,శుభ్రమైన టాయిలెట్స్,8గంటల పని,క్రమం తప్పకుండా వేతనం,హెల్త్ చెకప్‌లు వంటి సదుపాయాలు అందుతాయి. లేదంటే దేనికీ భరోసా లేదు. 12 గంటలు పనిచేయించుకోవడానికి ఫ్యాక్టరీలకు పూర్తి స్వేచ్చ ఉంటుంది.  ఓవర్‌ టైమ్ 76 గంటల పాటు పనిచేయించకోవచ్చు. ఉద్యోగులను తమ ఇష్టానుసారం తీసేయవచ్చు,లేదా నియమించుకోవచ్చు. దీనిఫై ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. గతంలో 100 మంది వరకు కార్మికులను ఒకేసారి తొలగిస్తే ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉండేది. ఇప్పుడు ఆ నిబంధన తొలగించారు.  పరిశ్రమ యాజమాన్యాలదే అంతిమ నిర్ణయం. వాళ్ల దయా దాక్షిణ్యాల పైనే కార్మికుల జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఆఖరికి ఫ్యాక్టరీల్లో  భద్రత ప్రమాణాల తనిఖీకి కూడా నీళ్లు వదిలారు. ఇకపై ఆ సర్టిఫికేషన్‌ను థర్డ్ పార్టీకి అప్పగించారు.
 ప్రభుత్వాలు కార్మిక చట్టాలను పూర్తిగా ఎత్తివేస్తే ఆటవికత రాజ్యమేలుతుందని,విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దూరమయ్యేందుకు ఇది కూడా కారణమవుతుందాని నల్సార్ యూనివర్సిటీకి చెందిన అమీర్ ఉల్లాఖాన్ అనే ఆర్థిక నిపుణుడు అభిప్రాయపడ్డారు.

భారతదేశంలో సంఘటిత రంగం కేవలం 10శాతం మాత్రమే. అసంఘటిత రంగంలో దాదాపు 90శాతం మంది ఉద్యోగ,ఉపాధి పొందుతున్నారు. సంఘటిత రంగంలో పనిచేస్తున్న 10శాతం మంది కార్మికుల భద్రత కోసం ఉన్న చట్టాలనే రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేస్తున్నప్పుడు.. ఇక అసంఘటిత రంగంలో కార్మికుల భద్రతకు కేంద్రం ఇస్తున్న హామీలు అమలవుతాయా? . కోవిడ్-19 లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత పని ప్రదేశాల్లో ఫిజికల్ డిస్టెన్స్,పరిశుభ్రత చాలా ముఖ్యమని, తక్కువ ఉద్యోగులతో పనులు చేయించుకోవాలని కేంద్రం చెబుతోంది. కానీ ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్,గుజరాత్ వంటి రాష్ట్రాలు కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించే విషయాన్ని పరిశ్రమల యాజమాన్యానికే వదిలిపెడుతున్నాయి. అసలే కరోనా కాలం.. పరిశ్రమల్లో శుభ్రమైన తాగునీరు అందించకపోతే,శుభ్రమైన టాయిలెట్స్ లేకపోతే,పని ప్రదేశాలను శానిటైజ్ చేయకపోతే,8గంటలకు బదులు 12గంటలు పనిచేయిస్తే.. కార్మికుల ఆరోగ్యం ఏమైపోవాలి.

 ఈ చర్యల కారణంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వాలు చెప్పడం కూడా ఆశ్చర్యంగా ఉందని.. ఒకవేళ అదే నిజమై ఎక్కువమందికి ఉద్యోగాలు దొరికితే.. 12 గంటల పని విధానానికి బదులు.. తక్కువ పని గంటలతో ఎక్కువ షిఫ్టుల్లో కార్యకలాపాలు సాగించాలి కదా అని అమీర్ ఉల్లాఖాన్ లాంటి ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

Thursday, 13 September 2018

BLF ను గెలిపించాలి సామాజిక న్యాయం సాధించాలి

52 శాతం మంది బిసిలు, 17 శాతం మంది ఎస్సిలు 14 శతం మంది మైనారిటీలు, 10 శాతం మంది గిరిజనులు మొత్తం 93 శాతం మంది అణగారిన జనం బాధలు తీరేలా పాలనా సాగాలి, అప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు,చదువుకునే అవకాశం లేనివాడికి చదువు, ఉద్యోగం లేనివాడికి ఉద్యోగం, ఉద్యోగికి నాణ్యమైన జీతం, దళితులూ, మహిళలు, వికలాంగులకు భద్రత లభించాలి అదే సామాజిక న్యాయం

Tuesday, 26 January 2016

అన్యాయం?

 అన్యాయం?

మళ్లీ అదే అన్యాయం? ఉట్నూరు, న్యూస్‌టుడే చదువుల తల్లి కొలువైన మన జిల్లాకు ఉన్నత విద్య, పరిశోధన కేంద్రాల ఏర్పాటు విషయంలో మరోసారి తీవ్ర అన్యాయం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాడు బాసరలో ఏర్పాటు చేయాల్సిన ఐఐటీని మెదక్‌ జిల్లాకు తరలించగా జిల్లాలోని ఉట్నూరులో ఏర్పాటు చేస్తామన్న గిరిజన విశ్వవిద్యాలయాన్ని తాజాగా వరంగల్‌లో నెలకోల్పేందుకు రంగం సిద్ధమవుతోంది. దీంతో అక్షర క్రమంలో ముందుండి ఆదివాసీ గిరిజనుల పోరుగడ్డలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడంపై నీలినీడలు కమ్ముకొంటున్నాయి. జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని గతేడాది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఇక్కడి ప్రజలను వూరించి వూరించి ఉసూరనిపించింది. అడవిబిడ్డల ఆశలు గల్లంతు చేసే దిశగా సర్కారు కార్యాచరణ రూపకల్పన చేస్తోంది. ఉన్నత విద్యాకేంద్రాల ఏర్పాటు విషయంలో జిల్లాకు అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారుతున్నా మనజిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు మౌనంగా ఉండడంతో అన్యాయం జరుగుతోందని విద్యార్థులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. జిల్లా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే ఇప్పటికైనా జిల్లాకు న్యాయం జరిగే అవకాశాలు లేకపోలేదంటున్నారు. సీఎం ఇచ్చిన హామీ ఏమైనట్లు? గతేడాది అక్టోబరులో జిల్లాలోని జోడేఘాట్‌లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కొమరంభీం వర్ధంతి సభకు హాజరైన సీఎం కేసీఆర్‌ ఈ జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తాం. దానికి ఖకొమరంభీం విశ్వవిద్యాలయంగగా పేరు పెడతామని హామీ ఇవ్వడంతో జిల్లాలోని గిరిఖజనంగలో ఆశలు చిగురించాయి. కానీ ప్రస్తుతం గిరిజన విశ్వవిద్యాలయం వరంగల్‌లో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో ఇక్కడి గిరిజనుల తీవ్ర నిరాశ చెందుతున్నారు. 

విస్తీర్ణంలో చాలా పెద్దది మన జిల్లా. విశాలమైన వనరులు, ఖనిజ సంపదున్న ఖిల్లా. చదవుల తల్లి సరస్వతీమాత కొలువైన జిల్లా. ఆదివాసీ గిరిజన సంస్కృతి, చరిత్రకు నిలయం.సాహితీ వేత్తలు, విద్యావంతులు, మేధావులు, సమర యోధులకు పుట్టినిల్లు.. ఇంతటి ప్రాధాన్యం కలిగిన మన జిల్లాలో ఒక్క విశ్వవిద్యాలయం కూడా లేదు. మన పక్కనున్న కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాలలో శాతవాహన, తెలంగాణ, కాకతీయ విశ్వవిద్యాలయాలున్నాయి. కానీ మన జిల్లాలో మాత్రం ఉన్నత విద్యను అందించే ఒక్క విశ్వవిద్యాలయం కూడా ఇప్పటి వరకు లేదు. పరిశోధనలు అందించే సాంకేతిక విద్యా కేంద్రం లేదు. నాడు బాసర ఐఐటీ విషయంలో అన్యాయం.. 2008 సంవత్సరంలో మన రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన ఐఐటీని మన జిల్లాలోని బాసరలో ఏర్పాటు చేయాల్సి ఉండగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆ ఐఐటీని మెదక్‌ జిల్లాకు తరలించింది. పెద్దఎత్తున ప్రజాఉద్యమం పెల్లుబకడంతో  బాసరలో ట్రిపుల్‌ ఐటీని ఏర్పాటు చేశారు. ఆ విధంగా నాడు ఐఐటీ ఏర్పాటు విషయంలో మన జిల్లాకు మొదటి సారి అన్యాయం జరిగింది. తాజాగా గిరిజన విశ్వవిద్యాలయం విషయంలో అన్యాయం ఖాయంగా భావిస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని వరంగల్‌ తరలించి ఇక్కడ కేవలం విశ్వవిద్యాలయం ప్రాంగణంతోనే సరిపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విశ్వవిద్యాలయం ఏర్పాటు తెరమీదకు వచ్చిందిలా.. రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి పర్చడంలో భాగంగా ఉన్నత విద్యావకాశాలను మెరుగుపర్చాలనే సదాశయంతో 2008లో యూపీఏ ప్రభుత్వం కొన్ని కొత్త విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, వనరులున్న ప్రాంతాలను ఎంపిక చేసి ప్రతిపాదనలను పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో మన జిల్లాలోని ఉట్నూరులో గిరిజన విశ్వవిద్యాలయం కోసం కావాల్సిన భూమి, రవాణా సౌకర్యాలు, విద్యుత్‌ ఇతర మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని ఇక్కడ ఏర్పాటు చేయాలని 2009 సంవత్సరంలో గిరిజన విశ్వవిద్యాలయం కోసం జిల్లా అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. వాటిపై చర్చించిన కేంద్ర ప్రభుత్వం పెద్దలు సంతృప్తి చెందారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేశారు. ఈ విషయం తెలియగానే ఇతర జిల్లాల ప్రజా ప్రతినిధుల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచారు. దీంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేసింది. ఈ క్రమంలోనే ఎన్నికలు వచ్చాయి విశ్వవిద్యాలయాల ఏర్పాటు ప్రతిపాదనలు మరుగునపడ్డాయి. విశ్వవిద్యాలయం కోసం జోరుగా సాగిన ఉద్యమాలు.. ఎన్నికలకు ముందు మన జిల్లాతోపాటు వరంగల్‌, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు తమ ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడంతో విశ్వవిద్యాలయం ఏర్పాటు మూనపడింది. దీంతో ఉద్యమాలు వూపందుకున్నాయి. మన జిల్లాలో ఉట్నూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని విశ్వవిద్యాలయం సాధన కమిటీ, విద్యార్థులు ప్రదర్శనలు, ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాలు, ప్రజాసంఘాలు ధర్నాలు చేశాయి. వీటితోపాటు ఐకాస ఆధ్వర్యంలో ముఖ్య మంత్రికి లేఖలు రాశారు. ఈ క్రమంలో రాష్ట్ర విభజన జరిగింది. అనంతరం ఎన్నికలు వచ్చి తెలంగాణ, ఆంధ్రలో కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. కొత్త ప్రభుత్వంలోనూ మళ్లీ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశం తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌ జిల్లాలో కొమరంభీం గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్య మంత్రి కేసీఆర్‌ హామీ ఇవ్వడంతో కొన్నేళ్లుగా సాగుతున్న పోరాటాలకు ఫలితం లభించిందని ఇక్కడి గిరిజనంలో ఆశలు చిగురించాయి. కానీ తాజా వార్తలు  గిరిపుత్రులను నిరాశపరుస్తోంది. అందుబాటులో సౌకర్యాలు.. ఆదివాసీ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన ఉట్నూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కావాల్సిన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని 2009లోనే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆనాడే ప్రభుత్వానికి పంపించారు. ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయానికి సమీపంలోఉన్న 400 ఎకరాల ప్రభుత్వ భూమిని విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం గుర్తించారు. 35 కిలోమీటర్ల దూరంలోనే జాతీయ రహదారి, హైటెన్షన్‌ విద్యుత్‌ సౌకర్యం ఉందని గుర్తించారు. వీటితోపాటు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే ఏటా ఇక్కడ వేలాదిమంది గిరిజన విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలున్నాయనే వివరాలను పొందుపర్చి నివేదికనలను ప్రభుత్వానికి పంపించారు. జిల్లా అధికారులు సైతం ఇక్కడ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే జిల్లా అభివృద్ధికి, విద్యాభివృద్ధికి వూతం లభిస్తుందని ప్రభుత్వానికి వివరించారు. గిరిజన విశ్వవిద్యాలయంతో కలిగే ప్రయోజనాలు..  గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు వలన గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుంది.  గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, వారి స్థితిగతులు, జీవన విధానం, వారి కళలు, భాష, ఆహార్యం, అటవీ ఉత్పత్తుల సేకరణ, ఉపాధి పొందే విధానం, వనమూలికలతో వైద్యం, వారిలో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతోపాటు వాటన్నింటిని బాహ్య ప్రపంచానికి తెలియజేయడం, వారి చరిత్రపై అధ్యయనం, స్థానిక సమస్యలు, వారి సామాజిక జీవన విధానంపై పరిశోధనలు చేయడానికి గిరిజన విశ్వవిద్యాలయం అవకాశం కల్పిస్తుంది.  అడువులతో ఆదివాసీ గిరిజనులకు విడదీయరాని సంబంధం ఉంది. పులుల సంరక్షణ కేంద్రం, బొగ్గు గనుల తవ్వకాలతో జరుగుతున్న జీవన విధ్వంసంపై పరిశోధనలు చేయడానికి దోహద పడుతుంది.  గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడంతో జాతీయ స్థాయిలో సెమినార్లు, సదస్సులు నిర్వహించడం, వాటికి మన దేశంలోని ఇతర రాష్ట్రాలతోపాటు విదేశీయులు హాజరుకావడం పరిశోధనలు చేయడంతో గిరిజన ప్రగతిపై పరిశోధనలకు అవకాశాలు ఏర్పడతాయి.  గిరిజనుల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలతోపాటు వారిలో సామాజిక, ఆర్థికాభివృద్ధికి గిరిజన విశ్వవిద్యాలయం దోహదపడుతుంది.  విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడంతో దాని పరిసరాల ప్రాంతాల్లో విద్యా, వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఇతర జిల్లాల గిరిజనులకు అవకాశం.. గిరిజన విశ్వవిద్యాలయం మన జిల్లాలో ఏర్పాటు చేస్తే మన జిల్లాతోపాటు వరంగల్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. స్థానిక, స్థానికేతర సీట్లు ఉంటాయి. గిరిజనులతోపాటు గిరిజనేతర విద్యార్థులకు సైతం కొన్ని సీట్లు గిరిజన విశ్వవిద్యాలయంలో ఉంటాయని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. జిల్లా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు మేల్కోవాలి.. జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని వరంగల్‌ తరలించనున్నారనే నేపథ్యంలో జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మేల్కోవాలి. వారు మౌనాన్ని వీడి జిల్లాకు న్యాయం జరిగేలా చూడాల్సిన అవసరం ఉందని గిరిజనులు కోరుతున్నారు. గతంలో ఇదే విధంగా ఐఐటీ తరలిపోయింది అదే బాటలో గిరిజన విశ్వవిద్యాలయం తరలిపోకుండా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని గట్టిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది.


Wednesday, 3 September 2014

టి అర్ ఎస్ ప్రజల గురించి పట్టించు కోవాలి

టి అర ఎస్ అధికారం లోకి వచ్చి మూడు నేల్లలు అవితున్నది. అయినా ఉద్యమ కాలం నాటి నినాదాలతోనే కాలం గడుపుతున్నది . దాంతో అనేక ప్రజా సమస్యలు అల్లాగే ఉన్నాయి. నినాదాలతో రాష్ట్రం అభివ్రుది కాదు. నిర్దిష్టమైన కార్యాచారనతోనే అవుతుంది .

అధికారంలోకి వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి అన్ని విషయాలు అఖిల పక్ష్మలోనో, లేదా మంత్రివర్గం లోనో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పుకునేవారు. కాని ఈ మధ్యకాలంలో జరుగుతున్నా విషయాలని పరిశీలిస్తే ఒంటెద్దు పోకడలు పోతున్నట్టు కనిపిస్తున్నది. సలహాదారుల పేర్లతో కొంత మంది తన అంతరంగీకులను నియమించి పరిపాలన అంతా తన నియంత్రుత్వంలోనే జరగాలని చూస్తున్నట్టు కనిపిస్తున్నది. అదే ఈ మధ్య బడ్జెట్ రూపకల్పన విషయంలో జరిగిన పరిణామాలలో కనిపించింది. కనీసం ఆర్ధిక మంత్రిని కూడా భాగస్వామ్యం చేయకుండానే బడ్జెట్ రూపకల్పన కోసం టాస్క్ ఫోర్స్ కమిటీలను వెశారు.

ఏది ఏమైనా ఇన్నాళ్ళు వేచి చుసిన వామపక్ష పార్టీలు ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్న టి అర్ ఎస్ ప్రభుత్వం పై పోరాటాలకు సిధమవుతున్నాయి. కొద్ది రోజుల్లోనే జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించి ప్రజా సమస్యల పై ఉద్యమాల కు సిద్ధం కావాలని కార్యాచరణ ప్రకటించాయి. సిపిఎమ్ రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా పార్టీ కార్యదర్శి తమ్మినేని అవే సంకేతాలను పంపిచారు. మాటలతో అభివ్రుది జరగదని, ప్రభుత్వం వెంటనే కార్యాచరణ రూపొందించి పనులు ప్రారంభించాలని, కోరారు.

ఇలాగే మాటలతో కాలం గడిపితే ఖచ్చితంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.


Friday, 22 August 2014

మోడీ నిజ స్వరూపం ఈ 2 నెలల్లోనే

ఎన్నికలకు ముందు ధరలపై, పేదల కష్టాలపై, ఎంతో మొసలి కన్నీరు కార్చిన మోడీ నేడు గద్దెనెక్కిన తరువాత చేస్తున్నదేమిటి ?  దాదాపు 2 నెలల కాలంలోనే రైలు ఛార్జీలు పెంచడం, నిత్యావసర సరుకుల ధరలు పెంచడం, భారత ప్రభుత్వ కంపెనీలను అందిన కాడికి అమ్ముకోవడం, కార్మిక చట్టాలను మార్చి కార్పోరేట్ శక్తులు కొమ్ము కాయడం, దేశంలో మత హింసను రెచ్చగొట్టి ప్రజలను విభజించడం వంటి దుష్ట తన దుష్ట చర్యలను ప్రారంభించాడు. ఈ 2 నెలల కాలంలోనే మోడీ పాలన ఇలా ఉంటే మరి రాబోయే 5 సంవత్సరాలలో పేద ప్రజలు, మైనారిటీల పరిస్థితి ఎలా ఉండబోతోందో ? 

Friday, 20 June 2014

మోడీ సర్కార్ నిజ స్వరూపం

బిజెపి చెప్పిందేమిటి ? ఇప్పుడు చేస్తున్నదేమిటి ? బహుత్ హువా మహాన్గాయికి మార్ ఇస్ లియే అబ్కి బార్ మోడీ సర్కార్ అన్నారు. ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు .